25, జనవరి 2022, మంగళవారం

Bhatti allegations on police: రాష్ట్ర పాలనలో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ భట్టి నేతృత్వంలో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. శాంతిభద్రతలు, పోలీస్‌ వ్యవస్థపై సమీక్షించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. పోలీసులు ఒత్తిళ్లకు లొంగి నిస్సహాయంగా మారితే ప్రజలకు రక్షణ ఉండదని భట్టి అన్నారు. పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావన పోయిందని... పోలీసుల నిస్సహాయతను అర్థం చేసుకున్నామని విమర్శించారు. పోలీసులు పోలీసుల్లాగా పనిచేయాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు. వారు ఒత్తిళ్లకు లొంగితే ప్రజలకు రక్షణ ఉండదని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి